అత్యంత ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు ఇవే!!!
ఇండియాలో గత కొన్ని నెలలుగా ముఖ్యంగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం డిమాండ్ చాలా వరకు పెరిగింది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు, విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు ప్రసారం చేయడం, ఆపై వినోద ప్రయోజనాల కోసం ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ స్ట్రీమింగ్ కారణంగా కూడా ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ అయింది. అన్ని రకాల బ్రాడ్బ్యాండ్ సంస్థలు తమ వినియోగదారుల కోసం తక్కువ ధరతో పాటుగా అత్యంత ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లను కూడా అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ సంస్థలు అందించే ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
బిఎస్ఎన్ఎల్ యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ నుండి అత్యంత ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.16,999 ధర వద్ద వస్తుంది. ఇది వినియోగదారులకు 100 Mbps ఇంటర్నెట్ వేగంతో 3,500GB ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాను అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత దీని స్పీడ్ 10 Mbpsకి పడిపోతుంది. ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో వినియోగదారులకు అపరిమిత కాలింగ్తో ఉచిత ల్యాండ్లైన్ కనెక్షన్ను కూడా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ నుండి ఈ ప్లాన్ చాలా ఎక్కువ ధరతో చూడటం కొంచెం వింతగా ఉంది.
జియోఫైబర్ యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్
జియోఫైబర్ నుండి అత్యంత ఖరీదైన ప్లాన్ నెలకు రూ.8,499 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్తో యూజర్లకు 1Gbps ఇంటర్నెట్ స్పీడ్తో 6,600GB నెలవారీ FUP డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్తో ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. నెట్ఫ్లిక్స్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్ విఐపి, సోనీలివ్, Zee5, ALTబాలాజీ, వూట్ కిడ్స్, హోయిచోయ్, షెమరూమి, లయన్స్గేట్ ప్లే, జియోసావన్, జియో సినిమా, డిస్కవరీ +, వూట్ సెలెక్ట్, మరియు ఈరోస్ నౌ వంటి OTT యాప్ లకు కూడా ఉచిత యాక్సిస్ ను కూడా వినియోగదారులకు అందిస్తుంది.
