Breaking News

మానవత్వం చాటుకున్న గోపీచంద్


 సినిమా స్టార్స్ అంటే అభిమానులకు ఎంతో పిచ్చి.వారి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడరు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే వారి ఇంట్లో పండగల భావిస్తారు. థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం దగ్గర్నుంచి.. పుట్టినరోజులకు కేకులు కట్ చేయడం, రక్తదానాలు చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే తమ అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే హీరోలు ఆదుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ఈ కోవలోనే హీరో గోపీచంద్ మానవత్వం చాటుకున్నారు. తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని రూ.2లక్షల ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్‌కు ఓ యువకుడు గోపీచంద్‌కు వీరాభిమాని.

ఇటీవల అతడికి కరోనా సోకడంతో వైద్యం కోసం భారీగా ఖర్చుచేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ విషయం గోపీచంద్‌కు తెలియడంతో వెంటనే రూ.2లక్షల చెక్ పంపించారట. తన అభిమాన హీరో చేసిన ఆర్థిక సాయంతో అతడు ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి అంత శభాష్ అంటున్నారు.